ఆదిపురుష్ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించిన మేకర్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ నిన్నటి వరకు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంత భావించారు. కానీ ఇప్పుడు సంక్రాంతి కాకుండా ఏకంగా జూన్ కు వెళ్ళిపోయింది. ఈ మేరకు మేకర్స్ ప్రకటించారు. బాహుబలి , సాహో , రాధే శ్యామ్ చిత్రాలతో నార్త్ లోను సత్తా చాటిన ప్రభాస్..ఇప్పుడు ఆదిపురుష్ అంటూ రామాయణ కథ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం జనవరి 12న విడుదల కావాల్సి ఉంది. అయితే, వీఎఫ్ఎక్స్ లో తప్పులను సరిచేయాలని యూనిట్ నిర్ణయించింది. దీనికి చాలా సమయం పట్టనుండటంతో రిలీజ్ ని వాయిదా వేసింది. వచ్చే ఏడాది జూన్ 16న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని దర్శకుడు ఓం రౌత్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

”ఆదిపురుష్’ అనేది కేవలం సినిమానే కాదు. శ్రీరామచంద్ర ప్రభువుపై మనకున్న భక్తి… మన చరిత్ర, సంస్కృతిపై మనకున్న నిబద్ధతకు నిదర్శనం. ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో విజువల్ ట్రీట్ ఇవ్వడం కోసం… ఈ సినిమా కోసం పని చేస్తున్న టీములకు మరికొంత సమయం ఇవ్వాల్సి వస్తోంది. వచ్చే ఏడాది జూన్ 16న ఈ సినిమా థియేటర్లలోకి వస్తుంది’ అని ట్వీట్ చేశారు.

ప్రభాస్, కృతి సనన్ జంటగా టి సిరీస్, రెట్రో ఫైల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నయ్యర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ లో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.