ఎస్పీ దక్షిణామూర్తి కరోనాతో మృతి
జగిత్యాల: జగిత్యాల అడిషనల్ ఎస్పీగా పని చేస్తున్న దక్షిణామూర్తి ఈరోజు కరోనాతో మృతువ్యాతపడ్డారు. వారం రోజుల క్రితం ఆయన కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఈరోజు తెల్లవారు జామున చికిత్స పొందుతూ మరణించారు. 1989 బ్యాచ్కు చెందిన దక్షిణామూర్తి వరంగల్ జిల్లాలో ఎస్సై, సీఐ, డీఎస్పీగా పనిచేశారు. నక్సల్స్ ఆపరేషన్స్తో పాటు వరంగల్లో సంచలనం సృష్టించిన యాసిడ్ దాడి కేసులో నిందితుల ఎన్కౌంటర్లో ఆయన పాల్గొన్నారు. కరీంనగర్ సవరన్ స్ట్రీట్కు చెందిన దక్షిణామూర్తి ప్రస్తుతం జగిత్యాల అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల జిల్లాలో కరోనా సోకి అనారోగ్యం పాలైన పోలీసులు చికిత్స పొంది విధుల్లో చేరినప్పుడు వారికి ఘన స్వాగతం పలికి పోలీసుల్లో మనో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. కాగా, ఈ నెల 31న ఆయన పదవీ విరమణ చేయనున్న క్రమంలో మృతి చెందడంతో విషాదం నెలకొంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/