టైమ్స్ నౌ సమ్మిట్‌లో ప్రధాని మోడి

YouTube video

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి ఢిల్లీలో జరిగిన టైమ్స్ నవ్ సమ్మిట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశంలో 130 కోట్ల మందికిపైగా జనాభా ఉంటే అందులో కేవలం కోటిన్నర మంది మాత్రమే ఆదాయ పన్ను కడుతున్నారని మోడి అన్నారు. ప్రజలంతా నిజాయితీగా పన్నులు కడతామని వాగ్దానం చేయాలని సూచించారు. ”2022లో మనం 75వ స్వాతంత్ర్య వేడుకలు జరుపుకోబోతున్నాం. ఈ సందర్భాన్ని వేడుకగా చేసుకుందాం. ఇండియాను సరిగ్గా పన్నులు కట్టే, గౌరవించే దేశం (ట్యాక్స్ కంప్లియంట్ సొసైటీ)గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోంది. గత నాలుగైదేళ్లుగా ఆ దిశగా చాలా వర్క్ చేశాం. ఇంకా చాలా చేయాల్సి ఉంది” అని మోడి చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/