టాలీవుడ్ చిత్రసీమలో విషాదం : నటుడు ఉత్తేజ్ సతీమణి కన్నుమూత
చిత్రసీమలో విషాదం చేసుకుంది. ప్రముఖ నటుడు , రచయిత ఉత్తేజ్ సతీమణి పద్మావతి కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఇటీవల బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చెర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఈ రోజు ఆస్పత్రిలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి, ప్రకాశ్ రాజ్ ,జీవిత రాశేఖర్తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఉత్తేజ్ను పరామర్శించారు. అలాగే ఉత్తేజ్కు, ఆయన కటుంబ సభ్యులకు సీనీ ప్రముఖులు, సహా నటీనటులు సంతాపం తెలుపుతున్నారు.
ఉత్తేజ్కు చెందిన మయూఖ టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ నిర్వహణలో పద్మావతి విధులు నిర్వర్తించేవారు. ఉత్తేజ్కి చెందిన వస్త్ర వ్యాపారాన్ని కూడా పద్మావతి నిర్వహించేవారు. ఉత్తేజ్- పద్మావతి దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. వారి పేర్లు చేతన ఉత్తేజ్, పాట. పెద్దమ్మాయి చేతన బాలనటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఓ సినిమాలో హీరోయిన్గా కూడా నటించింది. ఇక పద్మావతి అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు మహాప్రస్థానంలో జరగనున్నాయి.