మింత్రాతో జత కట్టిన హంబుల్
హైదరాబాద్: టాలీవుడ్ నటుడు మహేష్బాబుకు చెందిన దుస్తులు బ్రాండ్ హంబుల్ అతిపెద్ద ఫ్యాషన్ పోర్టల్ మింత్రతో జత కట్టింది. ఆన్లైన్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు దీంతో కలిసింది. ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం మేరకు ఇక నుంచి మింత్రలో హంబుల్ దుస్తులు లభిస్తాయి. మింత్రా ష్యాషన్ ఈ కామర్స్ కంపెనీ. ఇక, ది హంబుల్ కో మహేష్ బాబుకు చెందిన మెన్స్వేర్ బ్రాండ్. ఒప్పందం మేరకు హంబుల్ బ్రాండ్ కింద ఉన్న స్వెట్ షర్ట్స్, హుడీస్ షర్ట్స్, బాటమ్ వేర్ దుస్తులు మింత్రాలో అందుబాటులో ఉంటాయి. రూ.599 నుంచి ధర ప్రారంభమవుతుంది. దాదాపు 200 రకాల దుస్తులను ఈ కంపెనీ అందిస్తోంది. ఈ ఒప్పందం ద్వారా తమ బ్రాండ్ (హంబుల్) ఉత్పత్తులు దేశవ్యాప్తంగా కస్టమర్లకు అందుబాటులోకి వస్తాయని టాలీవుడు ప్రిన్స్ మహేష్ బాబు తెలిపారు. తాము ఆరు నెలల క్రితం హంబుల్ కో బ్రాండ్ను ప్రారంభించినట్లు తెలిపారు. ఇక మింత్రా హెడ్ నాగారం మాట్లాడుతూ ఇప్పటికే పలు అంతర్జాతీయ బ్రాండ్స్ను తమ సంస్థ కొనుగోలుదారులకు అందిస్తోందని, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కస్టమర్లకు అందించేందుకు హంబుల్తో ఒప్పందం కుదుర్చకున్నట్లు చెప్పారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/