అక్షయ్ కుమార్ మూవీ సెట్ లో ప్రమాదం

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ఛత్రపతి శివాజీ బయోపిక్ మూవీ లో సెట్ లో ప్రమాదం జరిగినట్లు సమాచారం. కొల్హాపూర్ లోని పవన్ హల్ గడ్ లోని షూటింగ్ జరుపుతుండగా, 19 ఏళ్ల నగేష్ ఖోబారో అనే ఫొటోగ్రాఫర్.. ప్రమాదవశాత్తూ 100 అడుగుల లోయలో పడిపోయాడట. అతడికి తీవ్ర గాయాలు కాగా, ప్రస్తుతం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది. పరిస్థితి మాత్రం ఇంకా విషమంగానే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయమై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఈ సంఘటనపై అటు మూవీ టీమ్, పోలీసులు గానీ అధికారికంగా ప్రకటన ఏం చేయలేదు. శివాజీ మహారాజ్ జీవితకథతో తీస్తున్న ఈ సినిమాకు మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. జై దుధానే, ఉత్కర్ష్ షిండే, విశాల్ నికమ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ‘ఆకాశమే హద్దురా’ హిందీ రీమేక్, క్యాప్సుల్ గిల్, బడే మియా చోటే మియా చిత్రాల్లోనూ అక్షయ్ నటిస్తూ బిజీగా ఉన్నాడు.