అభిమన్యు మిథున్ హాట్రిక్ వికెట్లు…

బెంగళూరు: కర్ణాటక పేసర్ అభిమన్యు మిథున్ హాట్రిక్ వికెట్లతో ఇరగదీశాడు. విజ§్ు హజారే ట్రోఫీలో భాగంగా తమిళనాడుతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో మిథున్ ఐదు వికెట్లతో చెలరేగిపోయాడు. ఈ ఐదు వికెట్లలో హాట్రిక్ సాధించడంతో అరుదైన ఘనతను నమోదు చేశాడు. విజ§్ు హజారే ట్రోఫీలో హాట్రిక్ వికెట్లు సాధించిన తొలి కర్ణాటక బౌలర్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో మిథున్ అద్భుతమైన గణాంకాలు నమోదు చేయడంతో తమిళనాడు 49.5 ఓవర్లలో 252 పరుగులకే ఆలౌటైంది. చివరి ఓవర్ మూడో బంతికి షారూఖ్ (27) వికెట్ సాధించిన మిథున్… ఆపై వరుస రెండు బంతుల్లో ఎం మహ్మద్ (10), మురుగన్ అశ్విన్ (0)లను పెవిలియన్కు పంపించాడు. ఫలితంగా హాట్రిక్ వికెట్ ఘనతను ఖాతాల్లో వేసుకున్నాడు. టాస్ గెలిచిన కర్ణాటక తొలుత తమిళనాడును బ్యాటింగ్కు ఆహ్వానించింది. దాంతో అభినవ్ ముకుంద్-మురళీ విజ§్ులు ఇన్నింగ్స్ను ఆరంభించారు. అయితే మురళీ విజ§్ు డకౌట్గా పెవిలియన్ చేరితే ముకుంద్ (85) రాణించాడు. అటు తర్వాత బాబా అపరాజిత్ (66), విజ§్ు శంకర్ (38)లు ఆకట్టుకోవడంతో తమిళనాడు 253 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. కర్ణాటక బౌలర్లు మిథున్ ఐదు వికెట్లకు జతగా, కౌశిక్ రెండు వికెట్లు సాధించాడు. ప్రతీక్ జైన్, కృష్ణప్ప గౌతమ్లకు తలో వికెట్ లభించింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.. https://www.vaartha.com/news/national/