ప్రజలకు ప్రభుత్వం భారీ ప్యాకేజీ ప్రకటించాలి

రాహుల్ గాంధీతో నోబెల్ గ్రహీత అభిజిత్

Rahul Gandhi speaks to Nobel Laureate Abhijit Banerjee

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీతో నోబెల్ గ్రహీత, ఆర్థిక వేత్త అభిజిత్ బెనర్జీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.. ఈనేపథ్యంలో అభిజిత్ బెనర్జీ లాక్‌డౌన్‌ నేపథ్యంలో భారత ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేశారు. భారీ ఉద్దీపన ప్యాకేజీను భారత్ ప్రభుత్వం విడుదల చేయాలని అభిజిత్ బెనర్జీ అన్నారు. ఇప్పటికే అమెరికా, జపాన్, యూరప్ దేశాలు ఈ పని చేస్తున్నాయని తెలిపారు. డిమాండ్ మేరకు ప్రజలకు అది చేరాలని, కొనుగోళ్లు ఊపందుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం డిజిటల్‌ పద్ధతుల్లో నగదు బదిలీలు జరిపే విషయం పేదలకు అందనంత దూరంలో ఉందని చెప్పారు. కాగా, లాక్‌డౌన్‌ సడలింపులు, ఎత్తివేత విషయాలను గురించి నిర్ణయాలు తీసుకునే పూర్తి స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలని రాహుల్ గాంధీ అన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/