ప్రమాణ స్వీకారం ఢిల్లీకి మాత్రమే పరిమితం

ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలవడం లేదు

Gopal Rai
Gopal Rai

న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకార మహోత్సవం కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితమని ఆప్ కీలక నేత గోపాల్ రాయ్ గురువారం స్పష్టం చేశారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులను గానీ, ఇతర రాష్ట్రాల, పార్టీల నేతలను ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించడం లేదని, ఢిల్లీకి మాత్రమే పరిమితం చేస్తామని ఆయన ప్రకటించారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో అరవింద్ కేజ్రీవాల్ ఈ నెల 16 న ముఖ్యమంత్రిగా రాంలీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు, ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా హాజరవుతారని మొదట ఆప్ ప్రకటించింది. తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమాచారం.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/