పాన్ ఇండియా మూవీ
ఆది సాయికుమార్ రెడీ
బాహుబలితో తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. అప్పటి నుండి మన టాలీవుడ్ హీరోలందరూ పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఈ క్రమంలో యువ కథానాయకుడు ఆది సాయికుమార్ హీరోగా ఓ పాన్ ఇండియా మూవీ రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ఒక సిరీస్లా చేయడానికి ప్లాన్ చేస్తుండటం విశేషం.
హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఆది సాయికుమార్ ఈ పాన్ ఇండియా చిత్రం తనకు పెద్ద బ్రేక్ అవుతుందని భావిస్తున్నారు.
ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో ఫాంటసీ ఎలిమెంట్స్, వి.ఎఫ్.ఎక్స్లకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.
యస్.వి.ఆర్ ప్రొడక్షన్స్ ప్రై.లి బ్యానర్పై డెబ్యూ డైరెక్టర్ బాలవీర్.యస్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని యస్.వి.ఆర్ నిర్మిస్తున్నారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/