‘AAA సినిమాస్’ ప్రారంభోత్సవం
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఏషియన్ సినిమాస్తో కలిసి అమిర్ పేట్ లో భారీ మల్టీప్లెక్స్ థియేటర్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. శనివారం ‘AAA సినిమాస్’ పూజా కార్యక్రమాలను బన్నీ నిర్వహించారు. నిర్మాత సునీల్ నారంగ్, నారాయణ దాస్ కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. సరికొత్త టెక్నాలజీతో హైదరాబాద్లో ఈ థియేటర్ అందుబాటులోకి రానుంది.
ఇటీవల విజయ్ దేవరకొండ మూవీ థియేటర్స్ను ప్రారంభించగా, త్వరలో అల్లు అర్జున్ కూడా అదే బాటలో పయనించనున్నారు. ప్రస్తుతం అల్లుఅర్జున్ ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నారు. సుకుమార్ దర్శకుడు. రష్మిక కథానాయిక. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తొలి భాగం డిసెంబరు 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది.