ఒమిక్రాన్ ఎఫెక్ట్ : తెలంగాణ లో మాస్క్ ధరించకపోతే వెయ్యి ఫైన్..
ఒమిక్రాన్ వైరస్ కారణంగా తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులను జారీచేయగా.. మాస్క్ ధరించకుంటే వెయ్యి రూపాయల జరిమానాను విధించనున్నట్లు హెచ్చరించింది.
రిస్క్ దేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన 325 మంది ప్రయాణికులకు పరీక్షలు చేయడం జరిగిందని.. వీరిలో 35 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్ వచ్చిందని హెల్త్ డైరెక్టర్ తెలిపారు. ఆమెకు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. అదే విధంగా, జీనోమ్ సిక్వెన్స్కి నమునాలు పంపించామని శ్రీనివాసరావు పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో, ఆఫీసుల్లో మాస్క్ నిబంధన అమలయ్యేలా చూడాలని వైద్యారోగ్యశాఖ ఆదేశాలు జారీచేసింది. అదే విధంగా బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు.. ఎక్కడికి వెళ్లిన వ్యాక్సినేషన్ పత్రం తప్పనిసరిగా అమలయ్యేలా చూస్తామన్నారు. కరోనా మహమ్మారి తీవ్రత తగ్గిందని అనుకునేలోపే ఒమిక్రాన్ వైరస్ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం తెలంగాణ లో ఇంతవరకు ఈ కేసులు వెలుగులోకి రానప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉంటె మంచిదని హెచ్చరిస్తున్నారు.