అమిత్ షా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు

కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. మునుగోడు లో ఈ నెల 21 న బిజెపి భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సభ కు ముఖ్య అతిధిగా కేంద్రమంత్రి అమిత్ షా రానున్నారు. అమిత్ షా కు సంబదించిన షెడ్యూల్ కూడా ఖరారు చేసారు. అయితే ఈ షెడ్యూల్ లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది.

ఈ నెల 21న అమిత్ షా.. మధ్యాహ్నం 3.40 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి 4.15 గంటలకు మునుగోడుకు చేరుకుంటారు. అక్కడ 4.35 గంటలకు సీఆర్పీఎఫ్ అధికారులతో కాసేపు సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం 4.40 నుంచి 6 గంటల వరకు అక్కడి బహిరంగసభలో ఆయన పాల్గొంటారు. సభ అనంతరం రోడ్డు మార్గంలో రామోజీ ఫిలిం సిటీకి చేరుకుంటారు. రామోజీ ఫిలిం సిటీలో 6.45 నుంచి 7.30 వరకు ఉంటారు. అనంతరం శంషాబాద్ లోని నొవోటెల్ హోటల్ చేరుకుంటారు. అక్కడ 8 నుంచి 9.30 గంటల వరకు పార్టీ ముఖ్య నేతలతో సమావేశాన్ని నిర్వహిస్తారు. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి పార్టీ నేతలకు మార్గనిర్దేశం చేస్తారు. అనంతరం ఢిల్లీకి బయలుదేరనున్నారు. ముందుగా రామోజీ ఫిలిం సిటీ కి వెళ్లడం , బిజెపి పార్టీ నేతలతో సమావేశం లేదు. తాజాగా ఈ మార్పులు చేసారు.