రాజస్థాన్ రాష్ట్రంలో ఘోర విషాదం : పెళ్లి వేడుకలో పేలిన గ్యాస్ సిలిండర్

రాజస్థాన్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ పెళ్లి వేడుకలో గ్యాస్ సిలిండర్ పేలి ఐదుగురు మృతి చెందగా , 50 మంది వరకు గాయపడ్డారు. జ్యోతి పూర్ లోని ఓ పెళ్లి వేడుకలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఐదుగురు సజీవదహనం కాగా 12 మంది పరిస్థితి విషమంగా మారింది. ఇక 50 మందికి గాయాలైనట్లు తెలుస్తుంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నట్టు తెలుస్తుంది. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

జోధ్‌పూర్‌ జిల్లా షేర్‌గఢ్‌ అసెంబ్లీ నియోజకవర్గం భుంగ్రా గ్రామంలో వివాహ వేడుక జరుగుతుండగా వంట గదిలో గ్యా స్ సిలిండర్ పేలడంతో 60 మందికి గాయాలయ్యాయి. సిలిండర్ పేలుడుతో పెళ్లి వేడుకలో గందరగోళ వాతావరణం నెలకొంది. పేలుడు దాటికి మంటలు వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా మంటల్లో చిక్కుకున్నవారి కేకలతో విషాదం వాతావరణం నెలకొంది. వెంటనే గ్రామస్తులు అప్రమత్తమై మంటలను అదుపులోకి తెచ్చారు. మంటల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ హిమన్షు గుప్తా, రూరల్ ఎస్పీ అనిల్ కయల్ ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. క్షతగాత్రులను బోధ్‌పూర్‌లోని మహాత్మాగాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో అంబులెన్సులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్‌ను నియంత్రించారు.