రైల్వే ట్రాక్ పై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్న జంట

ఏపీలోని ప్రకాశం జిల్లా కంభం మండలం సైదాపురం సమీపంలో రైల్వే ట్రాక్ పై ఓ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు పెద్దరావీడు మండలం బద్దీడుకు చెందిన వదినా, మరుదులు రాములమ్మ, శ్రీనుగా పోలీసులు గుర్తించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడ్డారా.. మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.