మోడీ పాలన ఓ కేస్ స్టడీగా ఉపయోగపడుతుంది : రాహుల్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ పాలనపై మండిపడ్డారు. ఎనిమిదేళ్ల పాటు మోడీ ప్రభుత్వం సక్రమంగా పాలించలేదని ఫైర్ అయ్యారు. మోడీ పాలన సక్రమంగా లేని కారణంగా కరెంట్ సంక్షోభాన్ని, ఉద్యోగాల సంక్షోభాన్ని, వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని రాహుల్ ఆరోపించారు. మోడీ పాలన ఓ కేస్ స్టడీగా ఉపయోగపడుతుందని దెప్పి పొడిచారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను ఎలా నాశనం చేయాలన్న దానిపై మోడీ అసమర్థ పాలన ఓ కేస్ స్టడీలా వుందంటూ రాహుల్ పేర్కొన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/