భారత్‌లో కొత్తగా 97,894 పాజిటివ్‌ కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 51,18,254.. మొత్తం మృతుల సంఖ్య 83,198

corona virus- india

న్యూఢిల్లీ: భారత్‌లో కొత్తగా 97,894 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 51,18,254కు చేరింది. గ‌త 24 గంట‌ల సమయంలో 1,290 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 83,198కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 40,25,080 మంది కోలుకున్నారు. 10,09,976 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 6,05,65,728 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 11,36,613 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/