దేశంలో కొత్తగా 9,765 క‌రోనా కేసులు

మొత్తం మృతుల సంఖ్య 4,69,724

న్యూడిల్లీ : దేశంలో కొత్త క‌రోనా కేసుల సంఖ్య‌ 9,765గా న‌మోద‌యింద‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న‌ 477 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న క‌రోనా నుంచి 8,548 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం 99,763 మంది క‌రోనాకు ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటున్నారు.

కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,40,37,054గా ఉంది. మృతుల సంఖ్య మొత్తం 4,69,724గా ఉంది. నిన్న 80,35,261 వ్యాక్సిన్ డోసులు వినియోగించారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,24,96,19,515 క‌రోనా వ్యాక్సిన్ డోసులు వాడారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/