దేశంలో 24 గంటలో 95 మంది మృతి

మొత్తం మృతుల సంఖ్య 1,981.. మొత్తం కేసుల సంఖ్య 59,662

corona-india
corona-india

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో భారత్‌లో 95 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 1,981 చేరింది. కాగా గత 24 గంటల్లో దేశంలో 3,320 మందికి కొత్తగా కరోనా సోకింది. దీంతో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 59,662కు చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 17,847 మంది కోలుకోగా, ఆసుపత్రుల్లో 39,834 మంది చికిత్స పొందుతున్నారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/