భారత్‌లో కొత్తగా 93,337 మందికి కరోనా

మొత్తం కేసుల సంఖ్య 53,08,015 ..మృతుల సంఖ్య మొత్తం 85,619

india- coronavirus

న్యూఢిల్లీ: భారత్‌లో కొత్తగా 93,337 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 53,08,015కు చేరింది. గ‌త 24 గంట‌ల సమయంలో 1,247 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 85,619కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 42,08,432 మంది కోలుకున్నారు. 10,13,964 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 6,24,54,254 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 8,81,911 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/