తెలంగాణలో కొత్తగా 925 పాజిటివ్‌ కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,62,653..మొత్తంమృతుల సంఖ్య 1,426

corona virus- Telangana

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 925 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం… గత 24 గంటల్లో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 1,367 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,62,653 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,49,157 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,426 కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 12,070 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 9,741 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 161 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 75 కేసులు నిర్ధారణ అయ్యాయి.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/