దేశంలో కొత్తగా 9,216 కరోనా కేసులు
మొత్తం మృతుల సంఖ్య 4,70,115
న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 9,216 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 99,976 మంది ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. నిన్న కరోనా నుంచి 8,612 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 3,40,45,666 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
కరోనాతో నిన్న 391 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,70,115కు చేరుకుంది. నిన్న 73,67,230 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. ఇప్పటివరకు మొత్తం 1,25,75,05,514 డోసుల వ్యాక్సిన్లు వేశారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/