దేశంలో కొత్తగా 90,928 కరోనా కేసులు
మొత్తం మృతుల సంఖ్య 4,82,876
corona virus
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా శరవేగంగావ్యాప్తి చెందుతోంది. మొన్న ఒక్కరోజులో 58,097 కేసులు నమోదు కాగా, నిన్న 90,928 మంది కరోనా సోకినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా నుంచి 19,206 మంది కోలుకున్నారు. 325 మంది కొవిడ్ వల్ల ప్రాణాలు కోల్పోయారు.
డైలీ పాజిటివిటీ రేటు 6.43 శాతంగా ఉంది. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో కరోనాకు 2,85,401 మంది చికిత్స తీసుకుంటున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,43,41,009కు చేరింది. మృతుల సంఖ్య 4,82,876గా ఉంది. 148.67 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్లు వేశారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/