ఆఫ్ఘనిస్తాన్ లోబాంబు పేలుడు.. 9 మంది చిన్నారుల మృతి!

ఆఫ్ఘనిస్థాన్‌: ఆఫ్ఘనిస్థాన్‌లో బాంబు పేలుడు సంభవించింది. ఈఘటనలో తొమ్మిది మంది చిన్నారులు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో పేలుడు జరిగింది. ఈ విషయాన్ని దేశంలో అధికారంలో ఉన్న తాలిబన్ ప్రభుత్వం కూడా ధృవీకరించింది. నంగర్‌హర్‌లోని లాలోపూర్‌లోని పాఠశాల ముందు ఆహార పదార్థాలతో వెళ్తున్న వాహనంలో పేలుడు సంభవించిందని తాలిబాన్ గవర్నర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ వాహనంలో మోర్టార్ ఉందని, వాహనం లాలోపూర్ జిల్లా పోస్ట్ వద్దకు చేరుకోగానే అది పేలిపోయిందని కొన్ని నివేదికలు తెలిపాయి.

ఐసిస్ ఆధీనంలో ఇక్కడ పాకిస్తాన్ చెక్ పోస్ట్‌లు ..ముళ్ల తీగలు ఉన్న నంగర్‌హర్ ప్రావిన్స్‌లోని లాలోపూర్ ప్రాంతంలో పేలుడు జరిగిందని మీడియా నివేదికలు తెలిపాయి. విశేషమేమిటంటే, ఈ ప్రాంతంలో ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ చురుకుగా ఉంది ..తాలిబాన్లతో తరచుగా హింసాత్మక ఘర్షణలు జరుగుతాయి. తాలిబన్ చెక్ పోస్టులపై కూడా ఐఎస్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ సంస్థ 2014 నుంచి ఈ ప్రాంతంలో తీవ్రవాద చర్యలకు పాల్పడుతోంది. వీరి దాడులు చాలా వరకు షియా మైనారిటీలపైనే జరుగుతున్నాయి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/