హయత్ నగర్లో దారుణం..స్కూల్ లో జరిగిన అవమానాన్ని తట్టుకోలేక 8వ తరగతి విద్యార్ధిని ఆత్మహత్య
హైదరాబాద్ హయత్ నగర్లో దారుణం చోటుచేసుకుంది. శాంతినికేతన్ స్కూల్ లో 8వ తరగతి చదువుతున్న విద్యార్ధిని అక్షయ ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. క్లాస్ లో అల్లరి చేస్తుందని టీచర్..అక్షయ ను బయట నిల్చుపెట్టింది. దీంతో మనస్తాపానికి గురైన అక్షయ..ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
క్లాస్ రూమ్ లో అసలేం జరిగిందనే విషయంపై తెలుసుకునేందుకు సీసీటీవీ పుటేజీను చూపించాలని..స్కూల్ యాజమాన్యాన్ని అడిగితే..వారు చూపించకుండా గోప్యంగా ఉంచుతుందని తెలిపారు. తమ కంటి కనుపాప కళ్లముందే కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థి సంఘాలు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు స్కూల్ ముందు భారీగా మోహరించారు. అక్షయ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.