తెలంగాణలో కొత్తగా 862 కరోనా కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,66,904..మొత్తం మృతుల సంఖ్య 1,444

corona virus-telangana

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 862 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం… గత 24 గంటల్లో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 961 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,66,904కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,54,676 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,444కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 10,784 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 8,507 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 164 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 57 కేసులు నిర్ధారణ అయ్యాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/