దేశంలో కొత్తగా 84,332 కరోనా కేసులు
మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,93,59,155
మొత్తం మృతుల సంఖ్య 3,67,081
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నది. నిన్న 84,332 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దాని ప్రకారం… నిన్న 1,21,311 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,93,59,155కు చేరింది. మరో 4,002 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,67,081కు పెరిగింది.
ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,79,11,384 మంది కోలుకున్నారు. 10,80,690 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు మొత్తం 24,96,00,304 మందికి వ్యాక్సిన్లు వేశారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/