ఆప్ఘనిస్తాన్లో ఆత్మహుతి దాడి.. 8 మృతి
కాబూల్: ఆప్ఘనిస్థాన్ సెంట్రల్ ప్రావిన్స్ మైదాన్ వార్దాక్లో సోమవారం మధ్యాహ్నం తాలిబన్లు జరిపిన కారుబాంబు ఆత్మహుతి దాడిలో 8 మంది ఆప్ఘన్ జాతీయ ఆర్మీ సైనికులు మృతి చెందగా మరో తొమ్మిది మంది గాయపడినట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వశాఖ మంగళవారం ధ్రువీకరించింది. కాబూల్కు పశ్చిమ దిశలోని సయీద్ అబాద్ జిల్లాలో సైనికుల కాన్వాయ్ను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగినట్లు సైనికాధికారులు తెలిపారు. దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. పౌరులపై ఆఫ్ఘన్ సైనికులు జరుపుతున్న వైమానిక దాడులకు ప్రతీకారంగానే దాడికి పాల్పడినట్లు వారు తెలిపారు. అంతర్ఆఫ్ఘన్ చర్చలను ప్రారంభించేలా ఖైదీల మార్పిడికి అష్రఫ్ ఘని ప్రభుత్వం తాలిబన్లతో శాంతిచర్చలు జరుగుపుతున్నతరుణంలో ఈ దాడి జరిగింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/