అమెరికాలో మరోసారి కాల్పులు..ఎనిమిది మంది మృతి
అట్లాంటాలోని మసాజ్ పార్లర్, స్పాల వద్ద కాల్పులు
వాషింగ్టన్ : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. గత రాత్రి ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఏడుగురు మహిళలే ఉండగా.. వీరిలో ఆరుగురు ఆసియన్లు ఉన్నారని పోలీసులు అధికారులు తెలిపారు. అట్లాంటాలోని మసాజ్ పార్లర్, స్పాల్లో గత రాత్రి చోరీలకు పాల్పడడానికి నిందితుడు రాబర్ట్ ఆరోన్ లాంగ్ ప్రయత్నించాడు. దీంతో ఈ సమయంలో ఆ ప్రాంతాల్లో ఉన్న భద్రతా సిబ్బంది అతడిని గుర్తించి, అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో అక్కడున్న వారిపై రాబర్ట్ కాల్పులకు తెగబడ్డాడు. దీంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
అతడి చేతిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఆరుగురు ఆసియా ఖండానికి చెందిన మహిళలు ఉన్నారు. మొదట అతడు రెండు స్పాల వద్ద, అనంతరం ఓ మసాజ్ సెంటర్ దగ్గర కాల్పులు జరిపాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని, నిందితుడిని అరెస్టు చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/