కువైట్‌ బిల్లు..8 లక్షల మంది భారతీయులపై ప్రభావం

ప్రవాసీ కోటా ముసాయిదా బిల్లును రూపొందించిన కువైట్

8 lakh Indians may be forced to leave after Kuwait approves Expat

కువైట్‌: కరోనా వల్ల కువైట్ ఆర్థిక వ్యవస్థ పతనమైంది. మరోవైపు ఆ దేశంలోని విదేశీయుల జనాభా విపరీతంగా పెరుగుతున్నది. అధికార గణాంకాల ప్రకారం కువైట్‌లో మొత్తం జనాభా 48 లక్షలు. ఇందులో విదేశీయులు 34 లక్షలు. కువైట్‌లోని మొత్తం విదేశీయుల్లో భారతీయుల సంఖ్య 14.5 లక్షలు. ఈక్రమంలోనే కువైట్ ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రవాసీ కోటా ముసాయిదా బిల్లు కనుక ఆమోదం పొందితే కువైట్‌లో నివసిస్తున్న భారతీయుల్లో 8 లక్షల మంది బలవంతంగా స్వదేశం రావాల్సి ఉంటుంది. ఈ ముసాయిదా బిల్లు రాజ్యాంగ బద్ధమేనని పేర్కొన్న కువైట్‌ జాతీయ అసెంబ్లీలోని లీగల్, లెజిస్లేటివ్ కమిటీ.. సమగ్ర ప్రణాళికను రూపొందించేందుకు మరో కమిటీకి బిల్లును అప్పగించింది. ఈ బిల్లు ప్రకారం.. కువైట్‌ జనాభాలో భారతీయులు 15 శాతానికి మించకూడదు. ప్రస్తుతం కువైట్‌లో 14.50 లక్షల మంది భారతీయులు ఉన్నారు. అంటే.. ఈ బిల్లు ప్రకారం 8 లక్షల మంది అధికంగా ఉన్నట్టు లెక్క. కాబట్టి బిల్లు కనుక ఆమోదం పొందితే వీరంతా వెనక్కి రావాల్సి ఉంటుంది. కాగా, 43 లక్షల మంది ఉన్న జనాభా వున్న ఆ దేశంలో, మరో 30 లక్షల మంది వలసదారులు వుండడం గమనార్హం.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/