నేపాల్‌లో 8 మంది భారతీయులు మృతి

హీటర్ కారణంగా.. ఊపరి అందక చనిపోయారని ప్రకటన

Nepal hotel
Nepal hotel

ఖాట్మండు: నేపాల్ పర్యటనకు వెళ్లిన కేరళకు చెందిన ఎనమిది మంది టూరిస్టులు నేపాల్‌లోని ఓ హోటల్‌లో మృతి చెందారు. హోటల్లో అమర్చిన హీటర్ గాలికి ప్రాణ వాయువు అందకపోవడంవల్లే వారు మృతి చెందారని తెలుస్తోంది. వీరిలో నలుగురు పెద్దవారు, నలుగురు పిల్లలు ఉన్నారు.
ఖాట్మండూ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన ఎనిమిది మంది భారతీయ పర్యాటకులు నేపాల్ ను సందర్శనకు వచ్చారన్నారు. నిన్నరాత్రి ఖట్మాండులోని ఓ హోటల్ నాలుగు గదులు బుక్ చేసుకుని అందులో విశ్రమించాచారని తెలిపారు. ఈ రోజు ఉదయం గదుల్లోని వారు బయటకు రాకపోవడంతో హోటల్ సర్వీస్ సిబ్బంది, హోటల్ యజమానికి తెలిపారన్నారు. యజమాని ఆదేశాలతో తలుపులు పగులగొట్టి చూడటంతో.. లోపల ఉన్నవారు మరణించి ఉన్నట్లు గుర్తించారన్నారు. వీరిలో ప్రబీన్ కుమార్ యాదవ్(39), శరణ్య (34), రంజిత్ కుమార్(39), ఇందు రిజిత్ (34), శ్రీ భద్ర(9), అబినబ్ సోరయ(9), అభినాయర్(7), భైష్ణబ్ రంజిత్(2) ఉన్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/