దేశంలో కొత్త‌గా 7,974 క‌రోనా కేసులు

మొత్తం 4,76,478 మంది మృతి

న్యూఢిల్లీ: దేశంలో కొత్త‌గా 7,974 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో ప్ర‌క‌టించింది. నిన్న క‌రోనా నుంచి 7,948 మంది కోలుకున్నారు. అలాగే, 343 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం 87,245 మంది హోం క్వారంటైన్లు, ఆసుప‌త్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య‌ 3,41,54,879కు చేరింది. వైర‌స్ వ‌ల్ల ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 4,76,478 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం 1,35,25,36,986 క‌రోనా వ్యాక్సిన్ డోసులు వినియోగించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/