భారత్‌లో కొత్తగా 76,472 మందికి కరోనా

మొత్తం కేసులు 34,63,973..మొత్తం మృతులు 62,550

coronavirus- india

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 76,472 మందికి కరోనా సోకిందని, అదే సమయంలో 1,021 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 34,63,973కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 62,550కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 26,48,999 మంది కోలుకున్నారు. 7,52,424 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా కేసుల రికవరీ రేటు 76.47 శాతంగా ఉంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/