భారత్‌లో కొత్తగా 75,809 మందికి కరోనా

మొత్తం కేసులు 42,80,423..మొత్తం మృతుల సంఖ్య 72,775

corona virus – india

న్యూఢిల్లీ: భారత్‌లో కొత్తగా 75,809 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన బులెటిన్‌లో పేర్కొంది. అదే సమయంలో 1,133 మంది మృతి చెందారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 42,80,423కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 72,775కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 33,23,951 మంది కోలుకున్నారు. 8,83,697 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 5,06,50,128 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,98,621 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/