భారత్‌లో కొత్తగా 75,760 కేసులు నమోదు

మొత్తం కేసులు 33,10,235..మొత్తం మృతులు 60,472

Covid-19-Effect-
Covid-19

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గత 24 గంటల్లో 75,760 మందికి కరోనా సోకిందని, అదే సమయంలో 1,023 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 33,10,235 కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 60,472కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 25,23,772 మంది కోలుకున్నారు. 7,25,991 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 3,85,76,510 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 9,24,998 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/