జైళ్లలో అల్లర్లు..75 మంది ఖైదీలు మృతి

క్విటో: ఈక్వెడార్ దేశంలో ఉన్న మూడు జైళ్ల‌లో ఖైదీలు ఘ‌ర్ష‌ణ‌ప‌డ్డారు. జైళ్ల‌లో జ‌రిగిన కొట్లాట‌ల్లో సుమారు 75 మంది ఖైదీలు మ‌ర‌ణించిన‌ట్లు స‌మాచారం. అయితే డ్రగ్ గ్యాంగ్‌ల మ‌ధ్య ఆ హింస చోటుచేసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. మాద‌క‌ద్ర‌వ్యాల వ్యాపారంపై ప‌ట్టు కోసం ప్ర‌త్య‌ర్థి గ్యాంగ్‌లు హింస‌కు దిగిన‌ట్లు తెలుస్తోంది. దేశంలో ఉన్న మూడు పెద్ద జైళ్ల‌లో ఈ ఘ‌ట‌న‌లు జ‌రిగాయి. అయితే మ‌ధ్యాహ్నం త‌ర్వాత అధికారులు జైళ్ల‌ను ఆధీనంలోకి తీసుకున్నారు.

రైవ‌ల్ గ్యాంగ్‌లు హింసాకాండ సృష్టించిన‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. గుయాక్విల్ న‌గ‌ర ప్రిజ‌న్‌ను సైనిక బ‌ల‌గాలు స్వాధీనంలోకి తీసుకున్నాయి. పోర్ట్ న‌గ‌రం మంటాలో ఉన్న జైలులో లాస్ చోనిరాస్ గ్యాంగ్ దారుణానికి పాల్ప‌డింది. డిటెన్ష‌న్ సెంట‌ర్ల‌లో ఆధిప‌త్యం కోసం రెండు వ‌ర్గాల మ‌ధ్య గొడ‌వ జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. సెంట్ర‌ల్ అమెరికాకు కొకైన్ స‌ర‌ఫ‌రా చేసేందుకు ఆ దేశంలో గ్యాంగ్ వార్ కొన‌సాగుతోంది. కొలంబియా, పెరు దేశాల్లో ఉత్ప‌త్తి అయ్యే కొకైన్‌ను స‌ర‌ఫ‌రా చేసేందుకు ఈక్వెడార్‌లో డ్ర‌గ్ కార్టెల్స్ ప‌నిచేస్తుంటాయి.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/