తెలంగాణలో కొత్తగా 721 కరోనా కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,75,261..మొత్తం మృతుల సంఖ్య 1480

Corona Tests
Corona Tests

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 721 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం… గత 24 గంటల్లో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 753 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,75,261కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,66,120 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1480కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 7,661 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 5,576 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 123, రంగారెడ్డి జిల్లాలో 51 కరోనా కేసులు నమోదయ్యాయి.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/