సింగపూర్ లో తాజాగా 70 పాజిటివ్ కేసులు
వీరిలో ఇద్దరు భారతీయులు
సింగపూర్ లో తాజాగా 70 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా సోకిన ఈ 70 మందిలో ఇద్దరు భారతీయులు ఉన్నారు.
సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన మేరకు ఆదివారం ఉదయానికి మొత్తం రోగుల సంఖ్య 802 కు చేరుకుంది.
కొత్తగా బయటపడిన 70 కేసుల్లో 41 మంది విదేశాల నుంచి సింగపూర్ వచ్చిన వారే. సింగపూర్ లో కరోనా సోకిన ఇద్దరు భారతీయ రోగులలో ఒకరికి 21 సంవత్సరాలు, మరొక రోగికి 55 ఏళ్ళు.
తాజా ‘నాడి’ వ్యాసాల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/health1/