హిమాచల్ప్రదేశ్లో ఘోర ప్రమాదం : లోయలో పడ్డ టెంపో..ఏడుగురు మృతి
హిమాచల్ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టూరిస్ట్లతో వెళ్తున్న టెంపో ట్రావెలర్ వెహికల్అదుపు తప్పి లోయలో పడడంతో ఏడుగురు టూరిస్ట్లు చనిపోగా , 10 మందికి పైగా గాయాలయ్యాయి. కులులోని బంజర్ వ్యాలీలోని ఘియాగి ప్రాంతంలో ఆదివారం రాత్రి 8:30 గంటలకు టూరిస్ట్లతో వెళ్తున్న టెంపో ట్రావెలర్ అదుపుతప్పి కొండపై నుంచి లోయలో పడింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి.
విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్లకు చెందిన వారని అధికారులు తెలిపారు. గాయపడిన ఐదుగురిని కులు జోనల్ ఆసుపత్రికి తరలించామని, వారు బంజర్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.