హైవేపై ఢీకొన్న బ‌స్సు, ట్ర‌క్కు..ఏడుగురు మృతి

7 Dead As Bus Collides With Truck On Nagpur-Pune Highway

పుణె: నాగ‌పూర్, పుణె హైవేపై ఘోర ప్ర‌మాదం సంభవించింది. బ‌స్సు, ట్ర‌క్కు ఢీకొన్న ఘ‌ట‌న‌లో ఏడు మంది మృతిచెంద‌గా, మ‌రో 13 మంది గాయ‌ప‌డ్డారు. పుణె నుంచి మెహ‌క‌ర్ రూట్లూ బ‌స్సు వెళ్తోంది. ఎదురుగా స్పీడ్‌గా వ‌స్తున్న ట్ర‌క్కు ఆ బ‌స్సును ఢీకొట్టింది. గాయ‌ప‌డ్డ‌వారిని సింద్‌కేదార్‌రాజా హాస్పిట‌ల్‌లో చేర్పించారు. రెండు వాహ‌నాలు ఎంత బ‌లంగా ఢీకొన్నాయంటే.. ఆ వెహికిల్స్ తుక్కుతుక్క‌య్యాయి. బ‌స్సు, ట్ర‌క్కుకు చెందిన గ్లాసు ప్యాన‌ల్స్ రోడ్డుపై చెల్లాచెదురుగా ప‌డిపోయాయి.

మరోవైపు మ‌హారాష్ట్ర‌లోని అమ‌రావ‌తి జిల్లాలోనూ ఇదే త‌ర‌హాలో మ‌రో యాక్సిడెంట్ జ‌రిగింది. ట్ర‌క్కు, ఎస్‌యూవీ కారు ఢీకొన్న ఘ‌ట‌న‌లో అయిదుగురు మృతిచెందారు.