దేశంలో కొత్తగా 6,990 క‌రోనా కేసులు

మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 4,68,980

న్యూఢిల్లీ: దేశంలో కొత్త క‌రోనా కేసుల సంఖ్య భారీగా త‌గ్గింది. నిన్న దేశంలో 6,990 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న‌ 190 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. నిన్న‌ 10,116 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు.

ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 1,00,543 మంది చికిత్స తీసుకుంటున్నారు. మొత్తం 3,40,18,299 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 4,68,980గా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 123,25,02,767 క‌రోనా డోసుల‌ను వినియోగించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/