దేశంలో కొత్తగా 6,915 కరోనా కేసులు
రోజువారీ పాజిటివిటీ రేటు 0.77 శాతం
న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. నిన్న 6,915 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, 180 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారని వివరించింది. నిన్న కరోనా నుంచి 16,864 మంది కోలుకున్నారని తెలిపింది.
ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 92,472 మందికి చికిత్స అందుతోందని పేర్కొంది. ఇప్పటి వరకు మొత్తం 177.70 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశామని తెలిపింది. ఇప్పటివరకు కరోనా నుంచి మొత్తం 4,23,24,550 మంది కోలుకున్నారని వివరించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.77 శాతంగా ఉంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/