దేశంలో కొత్తగా 6,650 కరోనా కేసులు
మొత్తం మరణాల సంఖ్య 4,79,133
India – corona virus
న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 6,650 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న 7,051 మంది కోలుకున్నారని పేర్కొంది. నిన్న కరోనా వల్ల 374 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది. దేశంలో ప్రస్తుతం 77,516 మంది ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారని పేర్కొంది.
కరోనా నుంచి మొత్తం 3,42,15,977 మంది కోలుకున్నారని తెలిపింది. ఇప్పటివరకు కరోనా వల్ల సంభవించిన మొత్తం మరణాల సంఖ్య 4,79,133 అని వివరించింది. దేశంలో నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 358కు చేరిందని తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 140,31,63,063 వ్యాక్సిన్ డోసులను వినియోగించినట్లు వివరించింది.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/