ఏపీలో కొత్తగా 6,617 కరోనా కేసులు

అమరావతి: ఏపీలో కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 6,617 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 18,26,751కు కరోనా కేసుల సంఖ్య చేరింది. 24 గంటల్లో కరోనాతో 57 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 12,109 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 10,228 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/