స్పెయిన్ లో ఇవాళ ఒక్క రోజే 655 మంది మృతి
హోటల్స్ ను తాత్కాలిక ఆసుపత్రులుగా మార్చిన ప్రభుత్వం

స్పెయిన్ లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. దేశంలో గురువారం ఒక్క రోజే కరోనా వైరస్ తో 655 మంది మృత్యు ఒడికి చేరుకున్నారు.

స్పెయిన్ లో కరోనా సోకిన వారి సంఖ్య 56 వేలు దాటింది. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు తగినన్ని ఆసుపత్రులు లేని కారణంగా ప్రభుత్వం హోటళ్లను తాత్కాలిక ఆసుపత్రులుగా మార్చేసింది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/