తెలంగాణలో ఆగని అత్యాచారాలు..17 ఏళ్ల మైనర్ బాలిక ఫై 65ఏళ్ల వృద్దుడు పలుమార్లు అత్యాచారం

తెలంగాణ రాష్ట్రంలో అత్యాచారాలు ఆగడం లేదు. ప్రతి రోజు ఎక్కడో ఓ సంఘటన వెలుగులోకి వస్తూనే ఉంది. ప్రభుత్వం, పోలీసులు , కోర్టులు ఎన్ని కఠిన శిక్షలు విదిస్తున్నప్పటికీ కామాంధుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. అభం శుభం తెలియని చిన్నారులను , ఒంటరి మహిళలను ఇలా ఎవర్ని వదిలిపెట్టడం లేదు. ఆఖరికి పండు ముసలి వారు సైతం మైనర్ బాలిక లపై అత్యాచారాలు చేస్తున్నారు. తాజాగా మెదక్ జిల్లా నిజాంపేట మండలం నార్లాపూర్ లో 17 ఏళ్ల మైనర్ బాలిక ఫై 65 ఏళ్ల వయసున్న వ్యక్తి పలుమార్లు అత్యాచారం చేసిన ఘటన బయటకొచ్చింది.

ఇంట్లో టీవీ చూడటానికి వచ్చిన సమయంలో అఘాయిత్యానికి పాల్పడిన వృద్ధుడు. బాలిక అస్వస్థతకు గురికాగా వైద్య పరీక్షలు నిర్వహించగా.. గర్భం దాల్చినట్లు వైద్యులు నిర్ధారంచారు. అనంతరం బాలిక తల్లి తండ్రులు నిజాంపేట పోలీసులకు పిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు పై మాత్రం నోరు మెదపడం లేదు. ఇక ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడం తో అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.