తెలంగాణలో కొత్తగా 643 కరోనా కేసులు
మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,75,904..మొత్తం మృతుల సంఖ్య 1,482
హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 643 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం… గత 24 గంటల్లో ఇద్దరు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 805 మంది కోలుకున్నారు.
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,75,904కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,66,925 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,482కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 7,497 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 5,434 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 109, రంగారెడ్డి జిల్లాలో 82 కరోనా కేసులు నమోదయ్యాయి.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/movies/