దేశంలో కొత్తగా 6,396 క‌రోనా కేసులు

రోజువారీ పాజిటివిటీ రేటు 0.69 శాతం

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా కేసులు, మృతుల సంఖ్య‌పై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివ‌రాలు తెలిపింది. దేశంలో కొత్త‌గా 6,396 కేసులు న‌మోద‌య్యాయ‌ని తెలిపింది. క‌రోనా నుంచి నిన్న‌ 13,450 మందికోలుకున్న‌ట్లు వివ‌రించింది. క‌రోనాతో నిన్న 201 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పింది.

ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్లోల‌ 69,897 మంది క‌రోనాకు చికిత్స తీసుకుంటున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 0.69 శాతంగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య‌ 4,23,67,070గా ఉంది. మొత్తం మృతుల సంఖ్య‌ 5,14,589గా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 178,29,13,060 క‌రోనా వ్యాక్సిన్ డోసులు వేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/