తెలంగాణలో కొత్తగా 637 కరోనా కేసులు
మొత్తం కేసుల సంఖ్య 2,32,671
Hyderabad: తెలంగాణలో కరోనా వ్యాప్తి తీవ్రత గణనీయంగా తగ్గింది.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కొద్దిసేపటి కిందట విడుదల చేసిన బులిటెన్ మేరకు గత 24 గంటల్లో అంటే మొన్న రాత్రి 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల వరకూ రాష్ట్రంలో కొత్తగా 637 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది.
దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,32,671 కి చేరింది. అదే సమయంలో కరోనా కారణంగా నలుగురు మృత్యువాత పడ్డారు.
దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 1,315కి పెరిగింది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/