దేశంలో కొత్తగా 625 కరోనా కేసులు

న్యూఢిల్లీః దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 625 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,62,141కి చేరింది. ప్రస్తుతం దేశంలో 14021 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు 4,41,17,611 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో ఎలాంటి మరణాలు నమోదు కాలేదు. ఇప్పటి వరకు 5,30,509 మంది కరోనా కారణంగా మృతి చెందారు.
మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని, రికవరీ రేటు 98. 78శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 219.74 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/